teluguleads.in
Newspaper Banner
Date : 27 March 2026, 12:55 pm Posted By : TELUGU LEADS

అయోధ్యలో అద్భుత దృశ్యం

హైదరాబాద్,లీడ్స్ ప్రతినిధి:
అయోధ్య రామలయంలో ఈ మధ్యాహ్నం అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. బాల రాముడు నుదిటిపై సూర్య తిలకం పడడం అందరిని కనువిందు చేసింది. దేవాలయంలోని మూడో అంతస్తులో సూర్య తిలకం పడే విధంగా దేవాలయ నిర్మాణం చేసిన సంగతి తెలిసిందే. అయితే శ్రీరామనవమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి రాగా సరిగ్గా 12 గంటల సమయంలో సూర్య తిలకం దర్శనం ఇవ్వడంతో భక్తులు పరవశించిపోయారు. ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి లైవ్లో ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించారు. పండుగ రోజు అద్భుత దృశ్యం తిలికించడం అదృష్టంగా భావిస్తున్నారు భక్తులు.