జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా నర్మెట సిఐ అబ్బయ్యతో పాటు ప్రస్తుతం ఏఆర్ అటాచ్ లో ఉన్న ఎస్సై షేక్ హమీద్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సస్పెండ్ చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. బచ్చన్నపేటలో హమీద్ ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ కేసు విషయంలో సీఐ, ఎస్ఐలు అక్రమాలకు పాల్పడ్డట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఈ కేసు విషయంలో విచారణ జరిపిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎట్టకేలకు వీరిద్దరిపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు ఇద్దరూ ఒకే కేసులో సస్పెండ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే పోచన్నపేట గ్రామానికి చెందిన ఓ కేసు విషయంలో వీరిద్దరిపై వేటుపడినట్లు చర్చ జరుగుతుంది.
