teluguleads.in
Newspaper Banner
Date : 17 April 2026, 6:31 pm Posted By : TELUGU LEADS

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

తహసిల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న జేఏసీ నాయకులు

తరిగొప్పుల,లీడ్స్ న్యూస్:
అపరిస్కృతంగా ఉన్న తెలంగాణ ఉద్యోగులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు శుక్రవారం తరిగొప్పుల తహసీల్దార్ ఎండీ.మోసిన్ ముస్తాబకు వినతిపత్రం అందజేశారు. దీర్ఘకాలికంగా రాష్టంలో ఉద్యోగులు ఎదురుకుం టున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాకుంటే దశల వారీగా పోరాటం చేస్తామని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పిఆర్టియు,టిపిటిఎఫ్, యూటీఫ్,డీటీఫ్ సంఘాల నాయకులు,కొయ్యడ శ్రీరాములు, బత్తుల నరేందర్,తుమ్మ శ్రీధర్ రెడ్డి,బొంపెల్లి సంతోష్ కుమార్,రేసు నాగార్జున రెడ్డి,ఆవుల అమర్నాథ్, ప్రవీణ్ గంగుల, తాటికొండ పెద్దన్న, కందుల నరహరి,ఎండీ. యూసుఫ్ పాషా,ఎండీ. ఖాదర్ పాషా, రాళ్లబండి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.