teluguleads.in
Newspaper Banner
Date : 21 August 2026, 8:31 pm Posted By : TELUGU LEADS

కాంగ్రెసులో సవతుల పోరు నడుస్తోంది

సీపీఐ జాతీయ నాయకులు నారాయణ

లీడ్స్,హైదరాబాద్: కాంగ్రెస్ నేతల్లో అంతర్గత కలహాల వల్ల రాష్ట్రంలో బీఆర్ఎస్ పుంజుకుంటుందని సీపీఐ జాతీయ నాయకులు నారాయణ ఇద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, ఏ తప్పూ చేయకుండా ఉంటేనే మంత్రులు,కిందిస్థాయి అధికారుల్లో భయం ఉంటుందని అయన అన్నారు. హైదరాబాదులో 22ఏ భూముల నిబంధనను కొందరు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలో సీపీఐ భాగస్వామి కాదు,ఎన్నికల్లో కేవలం సీట్ల సర్దుబాటు మాత్రమే చేసుకున్నామని అయన అన్నారు. తమ సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అయన ఈ సందర్బంగా అన్నారు.