teluguleads.in
Newspaper Banner
Date : 15 June 2026, 8:45 pm Posted By : TELUGU LEADS

పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

వరంగల్ పోలీస్ కమిషనర్

వరంగల్,లీడ్స్ న్యూస్ :రేపటి నుండి ప్రారంభం అయ్యే టెట్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషన్ సన్ ప్రీత్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో రేపటి నుండి మొదలుకొని 22వ తారీకు వరకు కొనసాగే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ ప్రకారం నిషేధాజ్ఞలు అమలలో ఉంటాయన్నారు. ఈ ఉత్తర ప్రకారం పరీక్ష జరిగే 500 మీటర్ల పరిధిలో ప్రజలు గుంపులుగా గుమి కూడటం, సభలు సమావేశాలు ర్యాలీలు ధర్నాలు నిషేధించబడ్డాయని,అలాగే పరీక్షా జరిగే పరిసరాలలో పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లను ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు. ఎవరైనా ఈ ఉత్తరం అతిక్రమిస్తే చర్యలు తప్పవని  కమిషనర్ హెచ్చరించారు.