
జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం కారణంగా ఒక్కసారిగా సిలిండర్ ధరలో పెరిగాయి. గృహ వినియోగ సిలిండర్లపై రూ.60, కమర్షియల్ సిలిండర్లపై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి. క్రూడాయిల్ బ్యారెల్ ధరలు పెరగడంతో గ్యాస్ ధరలు పెంచడం అనివార్యమైంది. తాజాగ పెరిగిన ధరలతో హైదరాబాదు సహా ఇతర జిల్లాల్లో గృహ వినియోగదారుల సిలిండర్ ధర రూ.965 చేరింది. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.