
జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): జిల్లాలోని అన్ని మండలాల్లో ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ సభ్యుల నియామకానికి దరఖాస్తు కోరుతున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనిలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆత్మ,(అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ) పథకం కింద బ్లాక్ లెవల్లో ఫార్మర్స్ కమిటీ సభ్యులను ఎంపిక చేస్తారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండే ఈ కమిటీ 2025 – 26 వ్యవసాయ పంటల ప్రణాళిక, ఇతర కార్యచరణ వంటి వాటిపై ప్రణాళిక చేసే అవకాశం ఉంటుంది. గ్రామాలు మండలాల్లో ప్రగతిశీల రైతులుగా ఉండి ఆసక్తి కలిగిన వారు ఈనెల 19 లో దరఖాస్తు చేసుకోవాలని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలు, తదితర పూర్తి వివరాల కోసం మండల వ్యవసాయ కార్యాలయంలో గానీ,జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో గానీ సంప్రదించాలని సూచించారు.