teluguleads.in
Newspaper Banner
Date : 27 March 2026, 7:50 pm Posted By : TELUGU LEADS

బావిలో పడి వృద్ధురాలు దుర్మరణం

రఘునాథపల్లి, లీడ్స్ న్యూస్: రఘునాథపల్లి మండలం గబ్బెట గ్రామానికి చెందిన తోడేటి కమలమ్మ (65) అనే వృద్దురాలు బావిలో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై డి నరేష్ యాదవ్ కథనం ప్రకారం సదరు వృద్ధురాలు గత కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయి ఇబ్బందులు పడుతుంది. గురువారం సాయంత్రం ఇంటి నుండి వెళ్లిపోయిన ఆమె శుక్రవారం ఉదయం అదే గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామానికి వెళ్లిన పోలీస్ లు కమలమ్మ మృత దేహాన్ని బయటికి తీసి పంచనామ అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులు అప్పగించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.