
రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: రఘునాథపల్లిలో ని శ్రీ మహాదేవస్వామి ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం స్థానిక బిఆర్ఎస్ నాయకుడు,మాజీ ఎంపిపి వై.కుమార్ గౌడ్,చింతకింది వెంకటేష్, నారగోని నగేష్ లు హనుమాన్ మాలధారణ స్వాములకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వై.కుమార్ మాట్లాడుతూ స్వాములకు అన్న ప్రసాదం అందించే అవకాశం రావడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానికులు గూడ కిరణ్, దుబ్బాక పరుశరాములు,బండి కుమార్, హనుమాన్ మాల దారణ స్వాములు కోళ్ల సందీప్,కోళ్ల రాజు,పేర్నె అనిల్,దుబ్బాక సాయి, పూజరి రాజు,ద్యావెర నాగరాజు,చెరుకు అజయ్,ద్యావర కృష్ణ తదితరులు ఉన్నారు.