లక్ష్మీ తండాలోమధ్య నిషేధం
రఘునాథపల్లి,(లీడ్స్ న్యూస్):జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం లక్ష్మీ తండ గ్రామ పంచాయతీలో స్థానికులు మద్యపాన నిషేధాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సర్పంచ్ పయ్యావుల రవి సమక్షంలో సోమవారం ఒక తీర్మానాన్ని చేసుకున్నారు. అలాగే అక్రమంగా ఎవరైనా బెల్టు షాపులు నిర్వహించినా, మద్యం అమ్మకాలు చేపట్టినా రూ. 50,000/- జరిమానా విధించాలని తీర్మానించారు. మద్యం విక్రయాలకు పాల్పడే వారిని పట్టించిన వారికి రూ.5,000 బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో బానోతు మహేందర్, రాజు,వసభ్యులు బానోతూ మౌనిక, మోథీలాల్,శ్రీను, బానోతు నరసింహ, బూలీ,నేతవత్ రవి,రాజు,...