teluguleads.in
Newspaper Banner
Date : 07 April 2026, 5:46 pm Posted By : TELUGU LEADS

వైద్య సిబ్బందికి అవార్డులు

అవార్డు ప్రధానం చేస్తున్న డిఎం అండ్ హెచ్ఓ

రఘునాథపల్లి ఏప్రిల్ 07,(లీడ్స్) : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం రఘునాథపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మరికూకల అయోధ్య,ఆశా వర్కర్ బానోత్ మంజులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తమ సేవా అవార్డులను ప్రధానం చేశారు. అదేవిధంగా జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్ చే ప్రశంస పత్రంను కూడా అందజేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ బి. స్రవంతి,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్ కిషన్, సూపర్వైజర్లు సులోచన, సుజనా,రజని, విష్ణువర్ధన్ రెడ్డి,పాండరి,ఆరోగ్య కేంద్రం సిబ్బంది వారిని ఈ సందర్బంగా శాలువాతో సత్కరించారు.