
రఘునాథపల్లి ఏప్రిల్ 07,(లీడ్స్) : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం రఘునాథపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మరికూకల అయోధ్య,ఆశా వర్కర్ బానోత్ మంజులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తమ సేవా అవార్డులను ప్రధానం చేశారు. అదేవిధంగా జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్ చే ప్రశంస పత్రంను కూడా అందజేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ బి. స్రవంతి,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్ కిషన్, సూపర్వైజర్లు సులోచన, సుజనా,రజని, విష్ణువర్ధన్ రెడ్డి,పాండరి,ఆరోగ్య కేంద్రం సిబ్బంది వారిని ఈ సందర్బంగా శాలువాతో సత్కరించారు.
