హైదరాబాద్, లీడ్స్ న్యూస్:
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేటు బిల్లుకు సంబంధించిన నోటీసును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్కు అందజేశారు. ఈ బిల్లుతో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతించాలని స్పీకర్ను కోరారు. అసెంబ్లీ సెక్రటరీకి కూడా నోటీసులు అందజేశారు. కేటీఆర్తో పాటు పలువురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసిన వారిలో ఉన్నారు.
