Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedరెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్

📰 Generate e-Paper Clip

రఘునాథపల్లి, లీడ్స్ న్యూస్: గోవర్ధనగిరి గ్రామం నుండి అశ్వరావుపల్లికి అనుమతి లేకుండా మట్టిని తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్థానిక పోలీసులు గురువారం రాత్రి పట్టుకొని సీజ్ చేశారు. గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కుసుంబా రాజు,పేరబోయిన అశోక్ అనే ఇద్దరు డ్రైవర్లను, రెండు ట్రాక్టర్లను అదుపులకు తీసుకున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. ఇసుక, మట్టిని కావలసినవారు  ముందుగా జిల్లా కలెక్టర్, స్థానిక తహసిల్దార్ ల అనుమతి తీసుకోవాలని ఎస్సై ఈ సందర్భంగా తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments