
రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్:
తెలుగుదేశం పార్టీ 44 ఏళ్లుగా ప్రజాసేవలో ఉండడం సంతోషంగా ఉందని ఆ పార్టీ రఘునాథపల్లి మండల అధ్యక్షుడు బొక్క రామచంద్రయ్య అన్నారు. ఆదివారం టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు ఎడ్ల మల్లేశం,ఎండి జహంగీర్ హాజరు కాగా ఆయన మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పేందుకు యుగపురుషుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎనిమిది నెలల్లోనే అధికారంలోకి వచ్చాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు ఉమ్మగొని నరసయ్య, కొంగరి నర్సింగరావు గండికోట యాదగిరి, మాస శివశంకర్,తూడి ఉమేష్ శాతర్ల రవి,ఎండి. సికందర్ కాదనూరి మధుసూదన్, పన్నాల శ్రీనివాస్, పిన్నింటి మల్లారెడ్డి,పన్నాల వెంకటరమణ, జేరిపోతుల రవీందర్,మచ్చ మధు పాల్గొన్నారు.
