Wednesday, August 26, 2026
No menu items!
HomeUncategorizedభాద్యతలు చేపట్టిన తహసీల్దార్

భాద్యతలు చేపట్టిన తహసీల్దార్

📰 Generate e-Paper Clip

రఘునాథపల్లి,(లీడ్స్ న్యూస్): రఘునాథపల్లి మండల నూతన తహసీల్దార్ గా బైరెడ్డి రాజేష్ రెడ్డి సోమవారం భాద్యతలు చేపట్టారు. ఇటీవల జిల్లా కలెక్టరేట్ సందీప్ కుమార్ ఝా ఏక కాలంలో 13 మంది తహసీల్దార్ లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతంలో ఇక్కడ పని చేసిన ఫణి కిశోర్ కలెక్టరేట్ కు బదిలీ పై వెళ్లగా జఫర్ ఘడ్ నుండి రాజేష్ రెడ్డి రఘునాథపల్లికి వచ్చారు. భాద్యతలు చేపట్టిన నూతన తహసీల్దార్ ను మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా రాజేష్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular