
జనగామ,లీడ్స్: ఒడిశా నుండి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను జనగాం పోలీసులు బుధవారం పట్టుకున్నారు. నిందితులు భగవాలే రాజ్ కుమార్, కోట నిఖిల్ గా గుర్తించారు.
జనగాం బస్స్టాండ్ వద్ద విధుల్లో ఉన్న ఎస్ఐ రతీష్, కానిస్టేబుళ్లు రాజ్ కుమార్, రమేష్,సాగర్ లు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ ఇద్దరిని తనిఖీ చేయగా, వారి వద్ద సుమారు 5 కిలోల గంజాయి పట్టుబడింది.తదనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
