
హైదరాబాద్ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): టి20 విశ్వవిజేతగా భారత్ నిలిచింది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టి20లో భారత్ మూడు సార్లు కప్పును సాధించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదటగా బౌలింగ్ ని ఎంచుకుంది. బ్యాటింగ్ కి దిగిన భారత్ 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు సాధించించగా ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 159 పరుల వద్ద ఆలౌట్ అయింది.
